మెగా వర్సెస్ అల్లు వార్ రోజురోజుకి ముదురుతోంది. వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపిన దగ్గర నుంచి.. అల్లు అర్జున్ (Allu Arjun) పై మెగా కాంపౌండ్ గుర్రుగా ఉంది. మెగా అభిమానులు బన్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ పై అసహనం వ్యక్తం చేస్తూనే ఉంది. నాగబాబు సోషల్ మీడియా వేదికగా బన్నీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశాడు. సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ ఫాలో చేశాడు. ఇక పవన్ కళ్యాణ్ పరోక్షంగా పుష్ప సినిమాపై వ్యాఖ్యలు చేశాడు. అల్లు అర్జున్ కూడా తగ్గేదేలే అంటూ.. ఇటీవల ఓ ఈవెంట్ లో నా ఫ్యాన్స్ అని నొక్కి చెప్పాడు. అలాగే నచ్చిన వాళ్ళ కోసం ఎక్కడికైనా వస్తానని ఇన్ డైరెక్ట్ గా తన నంద్యాల టూర్ ని సమర్ధించుకున్నాడు. దీంతో బన్నీపై మెగా అభిమానుల విమర్శలు మరింత పెరిగాయి. ఇలా రోజురోజుకి వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ పై జనసేన (Janasena) ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది కదా.. దీనిపై మీ స్పందన ఏంటని ఒక రిపోర్టర్ అడగగా బొలిశెట్టి శ్రీనివాస్ ఊహించని సమాధానమిచ్చాడు. “అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేదే నాకు తెలియదు. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా విడిపోయి షామియానా కంపెనీలాగా బ్రాంచ్ పెట్టుకుంటే తెలియదు కానీ.. ఉన్నది మెగా ఫ్యాన్సే. అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు అని నాకు తెలియదు. ఆయన అలా ఊహించుకుంటున్నారేమో ఫ్యాన్స్ ఉన్నారని. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan) అభిమానులే అల్లు అర్జున్ కి సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేనే గొప్ప, నా ఇష్టమైతే వస్తా అంటున్నారు. అసలు ఆయనను రమ్మని ఎవరు అడిగారు. ఆయన వచ్చిన రాకపోయినా మాకు నష్టం లేదు. మేము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాం. ఆయన వెళ్ళిన ఒక్క చోటా వాళ్ళు ఓడిపోయారు.” అంటూ బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగానే విమర్శలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here