కారం ఎక్కువైతే కనిపించే లక్షణాలు
క్యాప్సైసిన్ అధికంగా ఉన్న కారాన్ని, పచ్చిమిరపకాయలను వేసుకుని కూరలను, బిర్యానీలను తినడం వల్ల చాలా తక్కువ కాలంలోనే పొట్టలో మంట మొదలవుతుంది. అది గుండెకు చేరుతుంది. వికారంగా అనిపించడం, ఛాతీలో మంట, విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే రక్తపోటులో కూడా హెచ్చుతగ్గులు మొదలవుతాయి. మైకం కమ్మినట్టు అవుతుంది. శరీరానికి చెమటలు పడుతుంది. ఇలాంటి లక్షణాలు మీరు స్పైసీ ఫుడ్ తిన్న వెంటనే కనిపిస్తే మీ శరీరం ఆ కారాన్ని తట్టుకోలేకపోతుందని గుర్తించాలి.