ఇండియా అతిపెద్ద కార్ మార్కెట్ను కలిగి ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కార్లు లాంచ్ అవుతూనే ఉంటాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కూడా కూడా వచ్చే ఏడాది వినూత్న స్టైలింగ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అనేక కొత్త కార్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్కోడా, మారుతీ సుజుకి, హ్యుందాయ్, కియా, నిస్సాన్ కంపెనీల నుండి ఒక్కో కాంపాక్ట్ SUV అమ్మకానికి రానుంది. ఇవి రూ.10 లక్షల కంటే తక్కువ ఎక్స్-షోరూమ్ ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.