దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును రాజకీయం చేశారని,ఓ పక్కన అంబేడ్కర్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహరావు, అంజయ్య, కాకా వెంకటస్వామి విగ్రహాలు, సమాధులు ఉన్నాయని, తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వారి ఆనవాళ్లు ఉన్నాయని, రాజీవ్ విగ్రహం లేకపోవడం లోటుగా భావించి దేశం కోసం అమరుడైన రాజీవ్ విగ్రహం ఉండాలని భావించామన్నారు.