AP Floods : ఏపీలో భారీ వర్షాల కారణంగా పునరావాస కార్యక్రమాలపై మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ 294 గ్రామాలకు చెందిన 13,227 మంది ముంపు బాధితులను 100 పునరావాస కేంద్రాలకు తరిలించామన్నారు. రాష్ట్రంలో 62,644 హెక్టార్లలో వరి పంట, 7218 హెక్టార్లలో ఉద్యానవన పంటలు నీట మునిగాయని తెలిపారు