రాజన్న సిరిసిల్ల జిల్లా: మాస శివరాత్రి ( Masa Shivaratri )సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి( Sri Raja Rajeshwara Swamy) వారిని వేలాది భక్తులు దర్శించుకున్నారు.ఉదయం శ్రీ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఘనంగా నిర్వహించారు.
శ్రావణమాసం సందర్భంగా అద్దాల మండపంలో రుద్ర హోమాన్ని నిర్వహించిన అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వినోద్ రెడ్డి పాల్గొన్నారు.సాయంత్రం మహాలింగార్చన అద్దాల మండపంలో ఘనంగా నిర్వహించారు
.