పండుగ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి స్థాపన చేసి, స్వామిని ప్రార్థించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించి, భోగం సమర్పించి, ఉపవాసం ఆచరిస్తారు. ఆచారాల ప్రకారం, ప్రజలు గణపతిని ఒకటిన్నర రోజులు, మూడు రోజులు, ఏడు రోజులు లేదా పది రోజులు తమ ఇళ్లలో ఉంచుతారు. గణేష్ నిమజ్జనంతో పండుగ ముగుస్తుంది. ఈ రోజున భక్తులు వినాయకుడి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారు. వచ్చే సంవత్సరం తొందరగా వచ్చేయ్ అంటూ ప్రార్థిస్తూ ఈ వేడుకలు ముగుస్తాయి.