ఆక్రమణలపై కీలక వ్యాఖ్యలు..
‘రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేపడతాం. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ఆక్రమణలకు ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుంది. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యం. చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవు. నాలాల ఆక్రమణలను ఉపేక్షించేదిలేదు. కబ్జాలు చేసేవారు ఎంతటివారైనా వదిలేదిలేదు. పువ్వాడ ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్ను ఆదేశించాం. చెరువులు, కుంటల ఆక్రమణల జాబితాలు సిద్ధం చేయాలి. కోర్టుల అనుమతి తీసుకుని ఆక్రమణలు తొలగిస్తాం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.