మరో అల్పపీడనం..
ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది. ఏపీలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.