తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 03 Sep 202412:15 PM IST
- Donations to CM Relief Fund : తెలుగు రాష్ట్రాలను వరదలు వణికించాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు వరదల్లో కలిసిపోయాయి. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో.. ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.
Tue, 03 Sep 202411:17 AM IST
- BRS Mlas Car Attack : ఖమ్మంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న కారుపై దాడి జరిగింది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి ఉన్న కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Tue, 03 Sep 202410:50 AM IST
- Jangaon Accident : ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురు ప్రయాణికుల ప్రాణం తీసింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు స్పాట్ లోనే చనిపోగా.. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ప్రాణం విడిచారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది.
Tue, 03 Sep 202410:01 AM IST
- Telangana Floods : తెలంగాణలో భారీ వర్షాలు అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
Tue, 03 Sep 202409:58 AM IST
-
Khammam Floods : మున్నేరు ఉగ్రరూపానికి ఖమ్మం కన్నీళ్లు పెట్టుకుంది. ఎటుచూసినా వరద ముంపు ప్రాంతాలే కనిపిస్తున్నాయి. వేలాది మంది కట్టుబట్టలతో మిగిలిపోయారు. కనీసం తాగునీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. బురదలో కూరుకుపోయిన ఇండ్లు చూసి బాధితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Tue, 03 Sep 202406:20 AM IST
- Telangana Employees : తెలంగాణను వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరద బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించారు. వరద బాధితులకు సహాయంగా.. ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
Tue, 03 Sep 202405:17 AM IST
- ములుగు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని మదనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పెద్దగా అటవీ ప్రాంతం లేని చోట చిరుత పులి ఆనవాళ్లు కనిపిస్తుండటంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Tue, 03 Sep 202405:03 AM IST
- ఓ వ్యక్తి బియ్యం బస్తా విషయంలో గొడవ పడి, కక్ష పెంచుకుని ఓ బాలుడిని హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో హంతకుడికి జీవిత కాలపు కారాగార శిక్ష పడింది.
Tue, 03 Sep 202404:59 AM IST
- Khammam Floods : ఖమ్మం జిల్లాను వరదలు ముంచెత్తాయి. అనేక గ్రామాలు వరదల్లోనే నానుతున్నాయి. అటు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో 9 మంది ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జ్పై చిక్కున్నారు. వారిని జేసీబీ డ్రైవర్ ప్రాణాలకు తెగించి కాపాడారు.
Tue, 03 Sep 202404:42 AM IST
- Transport cutoff: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ఉధృతికి రోడ్లు తెగిపోయి పలుచోట్ల వంతెనలు కొట్టు కుపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేయడంతో పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tue, 03 Sep 202402:34 AM IST
- Telangana Rains : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు.. వాటి వల్ల వచ్చిన వరదలు 21 మందిని బలి తీసుకున్నాయి. భారీగా అస్తి నష్టాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా ఇప్పటికీ అనేక గ్రామాలు జలదిగ్భంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయాందోళనతో ఉన్నారు.
Tue, 03 Sep 202402:01 AM IST
- సంవత్సరం క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు తండ్రితో కలిసి నివసిస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏమి కష్టమొచ్చిందో ఏమో కానీ గంటల వ్యవధిలోనే అన్నాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇంధుప్రియాల్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
Tue, 03 Sep 202401:54 AM IST
- ఇంట్లో డబ్బుల విషయంలో జరిగిన గొడవలో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ట్రైన్ కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి రైల్వే ట్రాక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.