ప్రిన్సిపల్, ఆమె భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, పోక్సో కేసు
సమాచారం అందుకున్న లక్కిరెడ్డిపల్లె ఎస్ఐ రవీంద్రబాబు సిబ్బందితో అక్కడికి చేరుకుని విచారించారు. వేధింపులకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ భర్త బాలసుబ్బయ్యను అదుపులోకి తీసుకున్నారు. బాలికను లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రిన్సిపల్, ఆమె భర్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, పోక్సో కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి సీఐ వెంకటకొండా రెడ్డి, ఎస్.ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు. ఘటనపై విచారించేందుకు కలెక్టర్ చామకూరి శ్రీధర్ గురుకుల పాఠశాలకు చేరుకుని బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్ భర్త నుంచి తమకు లైంగిక వేధింపులు ఉన్నట్లు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ నిందితుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కలెక్టర్ పరామర్శించారు.