Ellampalli Project: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎల్లంపల్లికి ఇంకా వరద పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు, గోదావరి తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెవెన్యూ, పోలీస్ మున్సిపల్ , నీటిపారుదలశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.