అలీ(ali)బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి సినిమాలోనే పెరిగి సినిమాతోనే పెద్దవాడు అయ్యాడు. తెలుగు తెరపై ఎంతో  మంది కామెడీ నటులు ఉన్నప్పటికీ తన కంటు కామెడీ లో ఒక బ్రాండ్ ని సృష్టించుకున్నాడు.హీరోగాను శతదినోత్సవ చిత్రాల్లో చేసాడు.అదే విధంగా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తు మంచి మనిషిగా కూడా గుర్తింపుని పొందాడు. ఈ విషయం మరోసారి రుజవయ్యింది.

వరదల వల్ల నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకి అలీ  తన వంతు సాయంగా ఆరు లక్షల రూపాయలని ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాలకి ఎంతగా నష్టం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల పరిస్థితిని చూసి నేను నా భార్య జుబేదా ఎంతో బాధపడ్డాం. మా వంతుగా ఆంధ్రప్రదేశ్‌కు 3 లక్షలు, తెలంగాణాకు 3 లక్షలు చొప్పున మొత్తం ఆరు లక్షల రూపాయలను సీయం రిలీఫ్‌ ఫండ్‌కు అందచేస్తాం అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు.

ఇక ఈ న్యూస్ ప్రముఖంగా ప్రసారం అవ్వడంతో పవన్ కళ్యాణ్(pawann kalyan)అభిమానులు అలీని ఉద్దేశించి జగన్ ని వదిలి అలీ  బయటకి వచ్చాడు కాబట్టి సాయం చేసాడు. లేదంటే  జగన్ పర్మిషన్ కోసం వెయిట్ చేసే ఉండే వాడని, పైగా జగన్ ఇలాంటి ప్రజా విరాళాలకి వ్యతిరేఖం కాబట్టి అలీ విరాళాన్ని ఇచ్చి ఉండే వాడు కూడా కాదని కామెంట్స్ చేస్తున్నారు.  అలీ కొన్ని రోజుల క్రితం వైసిపీ ని వీడిన విషయం తెలిసిందే.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here