వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్:
అంతకు ముందు వరద నష్టంపై విజయవాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి తిలకించారు. కృష్ణా నది, బుడమేరు వరద ముంపునకు గురైన ప్రాంతాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు తదితర విభాగాల ద్వారా రెస్క్యూ, సహాయ పునరావాస చర్యలు, ఆహారం, తాగునీరు, ఇతర సహాయ చర్యలను, జరిగిన పంట, ఆస్తి, పశు నష్టం వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా కేంద్రమంత్రికి వివరించారు.