వేణుస్వామి మళ్లీ జోస్యం

నాగచైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్ వార్త వెలుగులోకి రాగానే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెరపైకి వచ్చారు. ఈ ఇద్దరి జాతకం గురించి చెప్తూ మరో మూడేళ్లు.. అంటే 2027 వరకు ఇద్దరికీ అంతా బాగుందన్నారు. కానీ ఆ తర్వాత మాత్రం ఓ మహిళ కారణంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చి విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పారు.

గతంలో కూడా ఇలానే నాగ చైతన్య, సమంత జాతకాలను వేణుస్వామి విశ్లేషించి విడిపోతారని జోస్యం చెప్పారు. దాంతో అప్పట్లో అక్కినేని అభిమానులు, సమంత అభిమానులు వేణుస్వామిపై విరుచుకుపడ్డారు. కానీ వేణుస్వామి అంచనా వేసినట్లే చైతన్య, సమంత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here