ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించిన వార్తల్లో రాజ్ తరుణ్ , లావణ్య ( Raj Tarun, Lavanya )వివాదం ఒకటనే సంగతి తెలిసిందే.ఈ వివాదం వల్ల రాజ్ తరుణ్ నటించి థియేటర్లలో విడుదలైన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.
అయితే ఈ వివాదం ముగిసిపోయిందని అందరూ భావిస్తున్న తరుణంలో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకోగా ఆ ట్విస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
పోలీసులు రాజ్ తరుణ్ ను నిందితునిగా పేర్కొంటూ ఛార్జిషీట్ దాఖలు చేశారు.
లావణ్య చెప్పిన విషయాలు నిజమేనని పోలీసులు ఛార్జిషీట్ లో( charge sheet ) పేర్కొన్నారు.రాజ్ తరుణ్, లావణ్య పది సంవత్సరాల పాటు సహజీవనం చేశారని పోలీసులు వెల్లడించారు.
ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
రాజ్ తరుణ్ ను నిందితునిగా చేర్చిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో చూడాలి.ఈ వివాదాలు రాజ్ తరుణ్ కెరీర్ పై కూడా తీవ్రస్థాయిలో ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది.రాజ్ తరుణ్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమని ఎందుకొచ్చిన తలనొప్పులు అని దర్శకనిర్మాతలు సైతం రాజ్ తరుణ్ కు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.లావణ్యతో మాట్లాడి రాజ్ తరుణ్ వివాదాన్ని పరిష్కరించుకుంటే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు వినిపిస్తున్నాయి.రాజ్ తరుణ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
రాజ్ తరుణ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది.