అందుబాటులో ఉన్న సాక్ష్యాలతో..

అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు సంజయ్ రాయ్ ను మాత్రమే నిందితుడిగా చూపుతున్నాయని, దర్యాప్తు ప్రస్తుతం తుది దశలో ఉందని, త్వరలోనే అభియోగాలు నమోదు చేయడానికి ఏజెన్సీ సిద్ధంగా ఉందని పేరు వెల్లడించని సీబీఐ వర్గాలు తెలిపాయి. కోల్కతా పోలీసుల నుంచి ఈ కేసు విచారణను సీబీఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును నత్తనడకన సాగిస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) సీబీఐపై విమర్శలు కూడా చేశారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించి 16 రోజులు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగలేదని ఆమె అన్నారు. సీబీఐ కన్నా కోల్కతా పోలీసులు ఈ కేసుపై మరింత క్రమం తప్పకుండా అప్డేట్స్ ఇచ్చారని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here