జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ 25 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో ను విడుదల చేస్తూ, ఆర్టికల్ 370 అనేది గడచిపోయిన చరిత్ర అని, అది మళ్లీ తిరిగి రాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.