30 కేసుల్లో నిందితుడు!
గురువారం మల్కాపూర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా బైక్ పై వెళుతున్న ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని.. తమదైన శైలిలో విచారించారు. ఆ విచారణలో ఆంజనేయులు చేసిన దొంగతనాలు ఒప్పుకున్నాడు. ఇప్పటివరకు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చోరీకి పాల్పడి 30 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే వికారాబాద్ లో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి మే 10న విడుదల అయినా అతనిలో మార్పు రాలేదు.