ఏటా రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12,000 ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతుబంధు స్కీమ్ త్వరలోనే రైతుభరోసాగా మారనుండగా… కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఎన్ని ఎకరాల లోపు వరకు ఈ స్కీమ్ ఇవ్వాలనేది కూడా కీలకంగా మారింది. పది ఎకరాలకు సీలింగ్ పెట్టే యోచనలో సర్కార్ ఉందని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here