ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి(keeravani)తనయుడు శ్రీ సింహ(sri simha)హీరోగా 2019 లో విడుదలైన చిత్రం మత్తు వదలరా. ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా  సీక్వెల్ గా మత్తు వదలరా 2 పేరుతో సెప్టెంబర్ 13 న  విడుదలయ్యింది.అంతే  కాకుండా తొలి రోజే రికార్డు కలెక్షన్స్ ని అందుకొని చిన్నచిత్రాల్లోనే ఒక ట్రెండ్ ని క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తుంది.

వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదలయిన మత్తు వదలరా 2 ఫస్ట్ డే 5 .3 కోట్ల గ్రాస్ ని అందుకుంది.ఇప్పుడు  ఈ కలెక్షన్స్ పట్ల సినీ ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకపోయినా ఆ స్థాయి కలెక్షన్స్ ని సాధించిందంటే రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ ని సాధించే  అవకాశం ఉందనే మాటలు కూడా  వినిపిస్తున్నాయి. ఆల్రెడీ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తు ఉంది.

మొదటి భాగానికి దర్శకత్వం వహించిన నితీష్ రానా(nitish rana)నే పార్ట్ 2 కి కూడా దర్శకత్వం వహించగా శ్రీ సింహ నే హీరోగా చేసాడు. సత్య,ఫరియా అబ్దుల్లా,సునీల్, ఛత్రపతి అజయ్, రాజా సిరివెన్నెల,రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో చెయ్యగా కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందించాడు.క్లాప్ ఎంటర్ టైన్మెంట్స్ పై చిరంజీవి,హేమలత పెదమల్లు నిర్మించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here