హైటెక్ పంతులుగా పేరు..

మహేష్ శర్మ.. యూఎస్, కెనడా, యూకే తో పాటు వివిధ ప్రదేశాలలో నివసిస్తున్న తెలుగు వారి కోసం పూజలు నిర్వహిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్న ఆయనను.. భక్తులు హైటెక్ పంతులు అని పిలుస్తారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు వివిధ రకాల దోష పూజల కొరకు తనను సంప్రదిస్తారని ఆయన తెలిపారు. మెదక్ మండలం పేరూరులో ఉన్న సరస్వతి ఆలయంలో దోర్బల మహేష్ శర్మ (39) ప్రధాన అర్చకుడిగా ఉంటూ పూజలు నిర్వహిస్తుంటారు. వినాయక ఉత్సవాల సమయంలో చాలా బిజీగా ఉంటారు. అయినా.. విదేశాల్లో ఉన్న భక్తుల కోరిక మేరకు వర్చువల్ గా పూజ చేయడానికి ఒప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here