336 ఎకరాల్లో…

మెదక్ జిల్లాలో 2023- 24 సంవత్సరంలో 74 మంది రైతులు 336 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారని అధికారులు వివరించారు. ప్రభుత్వం ద్వారా 336 ఎకరాలకు సంబంధించి 13 లక్షల రూపాయల సబ్సిడీని రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల్లో డ్రిప్ పరికరాలపై 90 శాతం రాయితీ సదుపాయం కల్పిస్తున్నారు. ఒక ఎకరానికి ఆయిల్ ఫామ్ మొక్కలకు రూ.9,650 మొదటి సంవత్సరం సబ్సిడీ ఇవ్వడంతో పాటు.. అంతర్ పంటల సాగు కోసం మొదటి , రెండవ, మూడవ, నాలుగవ సంవత్సరాలకు గాను రూ.26,450 సబ్సిడీ ఇస్తున్నారు. ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన నాలుగో సంవత్సరం తర్వాత నిరంతర దిగుబడి వస్తుంది. 10 నుంచి 12 టన్నులు దిగుబడి సాధించవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్ ఫామ్ ధర రూ.14,500 ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here