ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో.రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సిరిసిల్ల పట్టణంలోని బి వై నగర్ లో గల షాదీఖానా ఫంక్షన్ హాల్ లో, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నతమైన ఎం.ఎన్.జే క్యాన్సర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు తేదీ 16 /9/ 2024 రోజున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, 25 సంవత్సరాలు పైబడిన మహిళలకు పరీక్షలు నిర్వహించబడును.ఈ పరీక్షలలో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్, మామోగ్రామ్ ,FNAC (ఫైన్ నీడల్ ఆస్పిరేషన్ సైటోలజీ), సర్వైకల్ బయాప్సీ పరీక్షలు చేసి, వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితముగా వైద్యము కూడా అందించబడును.కావున 25 సంవత్సరాల పైబడిన మహిళలలో తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తికడుపులో నొప్పి, ఛాతీలో నొప్పి,చేతిలో గడ్డలు ఉన్నవారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొని, పరీక్షలు చేయించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ వసంతరావు తెలిపారు , ఈ కార్యక్రమానికి పట్టణంలో గల ప్రైవేట్ డాక్టర్లు, ఆర్.ఎం.పి, పి.ఎం.పీ.లు తమ వద్ద గుర్తించబడిన అనుమానిత పేషంట్లకు, 25 సంవత్సరాల పైబడిన మహిళలకు తెలియజేయాలని కోరారు.

 Free Cancer Screening Tests On 16th , Free Cancer Screening Tests, Breast Cancer-TeluguStop.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here