టీమిండియా తదుపరి బంగ్లాదేశ్‍తో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19న ఈ సిరీస్ మొదలుకానుంది. ఆ తర్వాత కూడా మరిన్ని సిరీస్‍ల్లో తలపడనుంది. అయితే, ప్రస్తుతం అందరి దృష్టి భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది నవంబర్ 22న ఈ ఐదు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. అయితే, ఇప్పటి నుంచే ఈ సిరీస్‍పై చర్చలు జరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here