గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 17న గణేష్ నిమజ్జనోత్సవం, శోభయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వినాయక నిమజ్జన వేళ ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలకు 600 స్పెషల్ బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 30 బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక బస్సులను వినియోగించుకుని.. గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని భక్తులకు సంస్థ విజ్ఞప్తి చేసింది.