జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు. ఎన్నికలకు ముందు జానీ మాస్టర్.. మాజీమంత్రి పేర్ని నానిపై చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అయ్యింది. ‘పేర్ని నానికి పీర్ల పండగే’ అనే డైలాగ్ పొలిటికల్ కాక పుట్టించింది. ఆ తర్వాత కూడా జానీ మాస్టర్ వైసీపీ నేతలపై రెచ్చిపోయాడు. పవన్ కళ్యాణ్తో కలిసి నెల్లూరు తదితర సభల్లో పాల్గొన్నారు. జానీ మాస్టర్ను పవన్ కళ్యాణ్ కూడా మెచ్చుకున్నారు. తాజాగా ఆరోపణలు రావడంతో.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.
Home Andhra Pradesh జానీ మాస్టర్పై పవన్కళ్యాణ్ సీరియస్.. చర్యలకు ఉపక్రమించిన జనసేన!-pawan kalyan orders johnny master to...