జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, వాగులు నీళ్లతో నిండుగా ఉన్నాయి.. సరదా కోసం పిల్లలు చెరువులలోకి, కుంటలల్లోకి ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని.. సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈత నేర్పించాలని ఉద్దేశం ఉంటే తల్లిదండ్రులే పిల్లల్ని తీసుకుని వెళ్లాలని సూచించారు. ఒంటరిగా, ఫ్రెండ్స్‌తో పిల్లలను ఈతకు పంపవద్దని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here