దేవుడు, దయ్యాల పేరుతో దళితులు కాలం వృధా చేసుకోవద్దని, పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. దళిత మహిళలపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ను దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ కోరాడు. కాగా డీఎస్పీ సోమవారం గ్రామానికి వెళ్లి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని శంకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమం లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు అహ్మద్, డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి హన్మకొండ దయాసాగర్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రవి బాధితులు భాగ్యమ్మ, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here