దూసుకెళుతున్న కమిటీ కుర్రోళ్ళు

ఈటీవీ విన్‍లో ప్రస్తుతం కమిటీ కుర్రోళ్ళు చిత్రం దుమ్మురేపుతుంది. ఈ రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్ 12వ తేదీన స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సందీప్ సరోజ్, త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, సాయి కుమార్ ముఖ్యమైన పాత్రలు చేశారు. కమిటీ కుర్రోళ్ళు సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించారు. నిర్మాతగా తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here