సన్న వడ్లకు రూ.500 బోనస్

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది విప్లవాత్మక నిర్ణయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచే సన్నాలకు(సన్న రకం ధాన్యం) 500 రూపాయల బోనస్ ను చెల్లించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here