నిర్ధారణ అయింది – సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం మరోసారి స్పందించారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్టు నిర్ధారణ అయ్యిందని చెప్పారు. ఈ విషయంలో విచారణ జరుగుతోందని.. బాధ్యులని శిక్షిస్తామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూని కూడా ఇలా అపవిత్రం చేస్తారని ఎవరూ ఊహించలేక పోతున్నారని అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బ తీయటమే ధ్యేయంగా గత 5 ఏళ్ళు పని చేశారని విమర్శించారు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే, వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే అనుభవిస్తారంటూ కామెంట్స్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here