వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్..
తిరుమల శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారనే ఆరోపణల్ని తోసిపుచ్చారు. తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు తన కొడుకు, మనుమడితో ఆ ఆరోపణలపై ప్రమాణం చేయాలని సవాలు చేశారు. రాజకీయాల కోసమే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.