అన్న క్యాంటీన్ రిబ్బన్ కటింగ్ కోసం టీడీపీ నాయకులు కొట్టుకున్నారు. ఈ ఘటన రాజంపేటలో చోటు చేసుకుంది. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వెళ్లిన రాజంపేట టీడీపీ ఇంఛార్జి తాను అంటే తాను అని సుగవాసి బాలసుబ్రమణ్యం, చమర్తి జగన్మోహన్ రాజు ఎవరికి వారు ప్రకటించుకొని అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కార్యక్రమంలో గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చివరకి గొడవ పడుతూనే అన్న క్యాంటీన్ ప్రారంభించారు.