తిరుపతి లడ్డూ కల్తీపై జరుగుతున్న వివాదాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ విషయంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.