కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరిది విజయం..

హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. మెజారిటీ మార్క్ 46. కనీసం 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతుంది. సెప్టెంబర్ 20 నాటికి రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఈ ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై పీపుల్స్ పల్స్ రిపోర్ట్ ఆసక్తికర అంచనాలను వెలువరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో, 35 సీట్లలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తోంది, 23 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోందని ఈ సర్వే తేల్చింది. స్వతంత్రులు 3 స్థానాల్లో, ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి మరో 3 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా 26 సీట్లలో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది. ‘‘అంటే, ఈ 26 సీట్లలో అత్యధిక సీట్లను గెల్చుకుంటే బీజేపీకి మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ ఈ సారి, 10 ఏళ్ల తరువాత మళ్లీ అధికారంలోకి వస్తుంది’’ అని పీపుల్స్ పల్స్ తేల్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here