India vs Bangladesh 1st Test: చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు విజయానికి భారత్ జట్టు బాటలు వేసుకుంది. మ్యాచ్లో మూడో రోజైన శనివారం తొలి సెషన్లో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ (82 బ్యాటింగ్: 108 బంతుల్లో 9×4, 3×6), శుభమన్ గిల్ (86 బ్యాటింగ్: 137 బంతుల్లో 7×4, 3×6).. నాలుగో వికెట్కి అజేయంగా 190 బంతుల్లో 138 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు.