యంగ్ టైగర్ ఎన్టీఆర్(ntr)వన్ మాన్ షో దేవర(devara)ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది.ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం  టికెట్స్ రేట్స్ ని పెంచుకోవచ్చని ప్రత్యేక జీవోని జారీ చెయ్యడంతో పాటుగా రిలీజ్ రోజు మిడ్ నైట్ పన్నెండు గంటల షో తో పాటు ఆరు షోలు ప్రదర్శించుకునేలా,ఆ తర్వాత రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఐదు షోస్ కి అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేసాడు.

 తెలుగు సినిమాకి సపోర్ట్ గా నిలుస్తు మా దేవర టికెట్స్ రేట్లని పెంచుకునేలా  కొత్త జీవోని తీసుకొచ్చిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు(chandrababu naidu) గారికి, మరియు గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్(pawan kalyan)గారికి,సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞలు అని ట్వీట్ చేసాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 22 న హైదరాబాద్ నోవాటెల్ లో  దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది.

మొదట అవుట్ డోర్ లో జరపాలని అనుకున్నా కూడా అభిమానుల తాకిడిని తట్టుకోలేకే నోవాటెల్ లో నిర్వహిస్తున్నారు.ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ కాగా శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్(jahnvi kapoor)హీరోయిన్ గా చేస్తుండగా కొరటాల శివ(koratala siva)దర్శకుడు. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here