ఇదీ జరిగింది..
మహారాష్ట్ర పూణెకి సమీపంలో ఉన్న హదాప్సర్ అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితులు వైభవ్ గణేష్ లబ్దే (31), ధ్యానేశ్వర్ దత్తు (27), మృతుడు అమోల్ మానే (39) మంచి స్నేహితులు. కాగా లబ్దేకి ఉన్న మద్యం అలవాటు గురించి అమోల్ మాటిమాటికి అతని ఇంట్లో చెప్పేవాడు. అతని భార్య, తల్లికి ఫిర్యాదు చేసేవాడు. స్నేహితుడి తాగుడు అలవాటును దూరం చేయాలని భావించాడేమో! కానీ ఇది లబ్దేకి నచ్చలేదు. సొంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడని అమోల్పై కోపం పెంచుకున్నాడు.