కరీంనగర్ జిల్లాలో మాతాశిశు ఆరోగ్య కేంద్రంతో పాటు.. 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మూడు కమ్యూనిటీ ఆస్పత్రుల్లో గర్భిణులకు వైద్యసేవలు సేవలందిస్తున్నారు. కానీ, డెలివరీలు మాత్రం మాతాశిశు ఆరోగ్య కేంద్రం, హుజూరాబాద్, జమ్మికుంట ఆసుపత్రిల్లో మాత్రమే జరుగుతున్నాయి. ఇన్ని ప్రభుత్వ ఆస్పత్రులున్నా.. వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో కొన్నిచోట్ల ఇబ్బందులు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి.