కంట్రోల్ రూమ్ ఆఫీసర్ మల్లేశం గౌడ్ వివరాల ప్రకారం.. ఉమా, పీటర్ దంపతులు తమ నాలుగేళ్ల కుమారుడు బెన్హర్తో కలిసి శనివారం సిరిసిల్ల నుండి సికింద్రాబాద్కు వెళ్తున్నారు. మార్గమధ్యలో సిద్దిపేట ఓల్డ్ బస్టాండ్లో బస్సు ఆగింది. అప్పుడు బాలుడు బెన్హర్ మరో మహిళతో కలిసి బస్సు దిగాడు. తమ కొడుకు బస్సు దిగిన విషయం గమనించని తల్లిదండ్రులు బస్సులో వెళ్లిపోయారు.