బాధపడి రాజీనామా చేశా

దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తాను దేశానికి సేవ చేసేందుకేరాజకీయాల్లోకి వచ్చానని, అధికారం, పదవి కోసం కాదని కేజ్రీవాల్ అన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలతో బాధపడి రాజీనామా చేశానని , గత 10 ఏళ్లలో తాను సంపాదించింది డబ్బు కాదని, గౌరవం మాత్రమేనని అన్నారు. త్వరలో జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తనకు అగ్ని పరీక్ష అని, తాను నిజాయితీపరుడు కాదు అని భావిస్తే ప్రజలు ఓటు వేయవద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here