పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఉనికిని చాటుకోలేకపోయింది. అప్పటి నుంచి ఒకట్రెండు సందర్భాలు మినహా.. కేసీఆర్ ఎక్కడా బయట కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఇక రెస్ట్ తీసుకుంటారు.. పార్టీని కేటీఆర్, హారీశ్ రావు నడిపిస్తారనే కామెంట్స్ వినిపించాయి. కానీ.. బీఆర్ఎస్ నేతలు మాత్రం వేరే మాట చెబుతున్నారు. త్వరలోనే తమ బాస్ గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.