ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందిన ‘దేవర’ సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే. స్టార్‌ హీరోల సినిమాల కోసం టికెట్‌ రేట్లను పెంచుకునే సౌలభ్యం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ‘దేవర’ థియేటర్‌ టికెట్‌ రేట్లను నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. దాని ప్రకారం పెరిగిన టికెట్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 

సెప్టెంబర్‌ 27 తెల్లవారు జాము ఒంటి గంటకు వేసే ప్రత్యేక షోలకు సంబంధించి ప్రతి టికెట్‌పై రూ.100లను పెంచారు. 29 స్పెషల్‌ షోలు ప్రదర్శించుకునే వీలు కల్పించారు. అదేరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు 6 షోలకు అనుమతినిచ్చారు. దీనికి టికెట్‌పై రూ.100 పెంచారు. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 6 వరకు అంటే 9 రోజులపాటు రోజుకి 5 షోల చొప్పున ప్రదర్శించుకునే సదుపాయం కల్పించారు. దీనికి సింగిల్‌ థియేటర్‌ అయితే రూ.25, మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌కి రూ.50 చొప్పున పెంచారు. గత సినిమాలతో పోలిస్తే ‘దేవర’ చిత్రం కోసం పెంచిన టికెట్‌ ధరలు చూసి మూవీ లవర్స్‌, అభిమానులు షాక్‌ అవుతున్నారు. ఎందుకంటే పెంచిన టికెట్‌ ధరలు అందుబాటులోనే ఉండడం వారికి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here