దీంతో కొత్తపల్లి మున్సిపాలిటీ తో పాటు బొమ్మకల్ దుర్శేడ్, గోపాల్ పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ విలీన గ్రామాల ప్రజలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చింతకుంట, దుర్శేడ్, గోపాల్ పూర్ గ్రామస్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పోరుబాట పట్టారు. దుర్శేడ్ వద్ద రాజీవ్ రహదారిపై రెండు గ్రామాల ప్రజలు ధర్నా రాస్తారోకో దిగి మంత్రి పొన్నం ప్రభాకర్ తీరును నిరసించారు. కార్పోరేషన్ వద్దు.. గ్రామ పంచాయితీలే ముద్దు అంటూ ప్ల కార్డ్స్ ప్రదర్శించారు.