పెద్దపల్లి, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్ పట్టణాల్లో నాలాల మీద నిర్మాణాలు జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సుభాష్ నగర్ సెంటర్లో ఓ బిల్డింగ్ కు దారి కోసం నాలాపైన రోడ్డు నిర్మించారు. దానిపై ఈ మధ్య కాలంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే సాగర్ రోడ్, భూంనగర్, కునారం రోడ్, పాత కోర్టు ఏరియా, రంగంపల్లిలో ఉన్న నాలాల మీద నిర్మాణాలు జరిగాయని గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.