కూటమి నేత
అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే ఓడిపోయిన తరువాత ప్రధాని పదవికి దినేశ్ గుణవర్ధనే రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానంలో శ్రీలంక ప్రధానిగా అమరసూర్య ఎన్నికయ్యారు. హరిణి అమరసూర్య అధ్యక్షుడు దిసనాయకే నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పవర్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో విక్రమసింఘే మూడో స్థానంలో నిలవగా, ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస రెండో స్థానంలో నిలిచారు. అలాగే, న్యాయ, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడుల శాఖలను కూడా అమరసూర్యకు అప్పగించారు.