ఆ తర్వాత కూడా వరద బాధితుల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. గత ఆది, సోమవారాల్లో బాధితుల జాబితాలను నగరంలోని 179 సచివాలయాల్లో ప్రదర్శించారు. ఆ జాబితాల్లో బాధితుల పేర్లు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ప్రకటించడంతో చాలా మ్యాపింగ్‌లో లేని కుటుంబాలు గల్లంతయ్యాయి. కొద్ది నెలలుగా అద్దెలకు వచ్చిన వారు, నగరంలో ఉంటూ సొంతూళ్లలో మ్యాపింగ్ చేసుకున్న వారి పేర్లు పరిహారం జాబితాలో లేకుండా పోయాయి. దీంతో గందరగోళం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here