కంపెనీ ఈ ఏడాది జూన్లో కొత్త నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ను లాంచ్ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ.9.10 లక్షలుగా నిర్ణయించారు. కొత్త కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ నాలుగు సిలిండర్ల మోటార్లను కలిగి ఉంది. కొత్త నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్.. నింజా జెడ్ఎక్స్-4ఆర్ కంటే అప్గ్రేడ్తో వచ్చింది. పూర్తి సీబీయూ యూనిట్గా పరిమితంగానే వీటిని భారత్కు తీసుకువస్తున్నారు. ఇది 399 సిసి లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ 4-సిలిండర్ ఇంజిన్తో వస్తుంది. 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బిహెచ్పీ శక్తిని, 37.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్లో ర్యామ్, ఎయిర్ ఇన్ టేక్ కూడా ఉన్నాయి. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్ బాక్స్తో వస్తుంది.