ఒకరిని కాపాడిన స్థానికులు..
ఇస్మాయిల్కు ఈత రావడంతో కొంతదూరం ఈదుకుంటూ వచ్చి చెట్లకొమ్మలు పట్టుకొని అరిచారు. గమనించిన గ్రామస్థులు అక్కడికి వచ్చి అతడిని కాపాడారు. షాకీర్ నీటిలో గల్లంతయ్యాడు. ఈ విషయాన్నీ గ్రామస్థులు అధికారులకు చెప్పారు. వెంటనే జహీరాబాద్ తహశీల్ధార్ రవీందర్, ఎంపీడివో మహేందర్ రెడ్డి, ఆర్ఐ రుక్మొద్దీన్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రాణాలతో బయటపడ్డ ఇస్మాయిల్ను పరామర్శించారు. జహీరాబాద్, కర్ణాటక పోలీసులు, అధికారులు.. నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ ఇంకా లభించలేదు.